అమరావతి, మార్చి 6: ఐటి గ్రిడ్ వ్యవహారం నేపథ్యంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు సంధించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.
‘నాలుగేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా దొరికినప్పటి సీన్ రిపిట్ అయ్యింది, ఎదురు దాడి, పొంతన లేని విమర్శలు, వణుకుడు సేమ్ టు సేమ్ అప్పటిలాగే ప్రవర్తిస్తున్నాడు, మంత్రులు, డిజిపి, అడ్వకేట్ జనరల్లతో సంతాప సమావేశాలు. ఏం లేకపోతే ఈ విషాద వీచికలేమిటి చంద్రబాబు?’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
‘ఏపి ప్రజలు తక్షణం తమ ఎటిఎం, క్రిడెట్ కార్డుల పాస్వర్డులను మార్చుకోవాలి, అకౌంట్లోని డబ్బులు లూటీ అయ్యే ప్రమాదం ఏర్పడింది. కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన వ్యక్తే కన్న బిడ్డల వ్యక్తిగత సమాచారాన్ని బజారులో పెట్టాడు, తండ్రి కొడుకులిద్దరు సైబర్ సాబోటేజ్కు పాల్పడ్డారు’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.
‘దొంగే దొంగ అని అరవడం, ఎదురు దాడులు, కుల మిడియా ద్వారా అబద్దపు కథనాలు..ఎన్ని చేసినా తప్పు చేసినోళ్లు తప్పించుకోలేరు, నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కొట్టుకుపోయినట్లు నక్కజిత్తుల కుట్రలకు తెరపడినట్లే, రేపో మాపో షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుందాం.’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!