రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గడంతో వైసిపి మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపింది. ఈ క్రమంలో మహానాడు ముందు ఇద్దరు ఎమ్మెల్యేలపై వల వేసిన వైసీపీ, తాజాగా మహానాడు జరుగుతుండగానే చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా మరింతగా ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం షురూ చేయడం మనకందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇంకొంతమంది వైజాగ్ ప్రాంతానికి చెందిన నాయకులు టీడీపీ గోడ దూకడానికి రెడీగా ఉన్నట్లు మనం చూశాం.
ఈ విషయం నడుస్తూ ఉండగానే తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ డౌన్ కాబోతున్నట్లు టాక్. అది కూడా చంద్రబాబు కి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంతో ఫేవరెట్ లీడర్ అయినా మాజీ మినిస్టర్ పితాని సత్యనారాయణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పితాని సత్యనారాయణ మినిస్టర్ గా పని చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో 2014 ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో టీడీపీ లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో ఓడిపోయారు.
అయితే… దాదాపు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన పితాని పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదంట. పైగా తన సొంత నియోజకవర్గం ఆచంటలో సొంత సామాజిక వర్గం శెట్టిబలిజ కి చెందిన వైసీపీ నాయకుడు కౌరు శ్రీనివాసు రాజకీయంగా నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శించడంతో తనకు రాజకీయ భవిష్యత్తు పోతుందేమో అని పితాని ఆందోళన చెందుతున్నారట. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో త్వరలోనే వైసీపీ పార్టీలోకి పితాని రావటానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. పితాని సత్యనారాయణ గ్యారెంటీగా పార్టీ మారితే మాత్రం టీడీపీకి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు