హైదరాబాదు, మర్చి 6 : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఐటి గ్రిడ్ వ్యవహారంపై గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ను కలిసి ఫిర్యాదు అందజేశారు.
అనంతరం జగన్ మిడియాతో మాట్లాడుతూ ఐటి గ్రిడ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సైబర్ క్రైమ్పై గవర్నర్కు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్ పాల్పడితే నేరం కాదా అని జగన్ ప్రశ్నించారు. దేశ చరిత్రలో మొట్టమెదటి సారిగా ఇంత భారీ సైబర్ క్రైమ్ జరిగిందని జగన్ పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు రెండు సంవత్సరాల క్రితం నుండి దీన్ని చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు చేసిన సైబర్ క్రైమ్పై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. .
ఐటి గ్రిడ్ అనే ఒక కంపేనీపై రైడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయని జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్లో ఉండకూడని డేటా ఉందన్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఆధార్ డిటెయిల్స్ ఒటర్ ఐడి విత్ కలర్ ఫోటోలు, బ్యాంక్ ఎకౌంట్ డిటెయిల్స్ ఏ రకంగా ఐటి గ్రిడ్ ఆఫీసులో, టిడిపి సేవా మిత్ర యాప్లో ప్రత్యక్షం అవుతున్నాయని జగన్ ప్రశ్నించారు.
జగన్ వెంట సీనియర్ నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, కొలుసు పార్థసారధి , కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.