వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ ప్రభుత్వం లో ఎక్కడ అవినీతి లేకుండా ప్రక్షాళన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా తన పరిపాలన ఎక్కడ భేషజాలకు పోకుండా కులాలకు మతాలకు ఆఖరికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే రీతిలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాణిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఇసుక విషయంలో చాలా జిల్లాలో వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్లు విపక్షాల నుండి వరుసగా ఆరోపణలు ఇటీవల వస్తూ ఉన్నాయి. దీంతో వైయస్ జగన్ అసలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో సీక్రెట్ సర్వే చేయించారట.
ఎవరికీ గుట్టుచప్పుడు కాకుండా చేయించిన ఈ సర్వే లో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నట్లు విషయం బయటపడింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో కూడా ఉండటంలేదని ఈ సర్వే లో బయటపడింది. ఈ రకంగా వ్యహరిస్తున్నవారి పేర్లు జగన్ దృష్టికి పెద్ది రెడ్డి నివేదిక రూపంలో తీసుకొచ్చారట. దీంతో తాజాగా ఈ విషయం పార్టీలో బయటపడటంతో…జగన్ దగ్గర ఉన్న లిస్టులో తమ పేరు ఉందో ఏమో అని వైసిపి ఎమ్మెల్యేలకు తెగ టెన్షన్ పట్టుకున్నట్లు టాక్ వినపడుతోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బంధువులు నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా ఈ సర్వేలో బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఇప్పటికే ముగ్గురు మంత్రులకు వారి బంధువులకు జగన్ నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో అక్రమాలకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలను జగన్ ఏవిధంగా కంట్రోల్ చేస్తారు అన్నది పార్టీలో సస్పెన్స్ గా మారింది. మరోపక్క కొత్త జిల్లాలు ఏర్పాటు అంటూ వైయస్ జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నాయకుల నుండి వ్యతిరేకత వస్తే… తిరగబడే అవకాశం ఉంటే, ఆ పరిస్థితిని జగన్ ఏవిధంగా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.