అధికారంలోకి రాక ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొందరు నేతలను బుజ్జగించేందుకు శాసనమండలి తాయిలం చూపారు.అదే ఇప్పుడు వైసీపీలో కొంత అశాంతికి కారణమవుతోంది.
ఏపీలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కొందరు సీనియర్ వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దేనికి సంకేతమని విశ్లేషిస్తే ఉన్న శాసనమండలిని రద్దు చేయడాన్ని అనేక మంది సీనియర్ నేతలు ఆంతరింగక సంభాషణల్లో తప్పుపడుతున్నారు. దాడి వీరభద్రరావు, సి.రామచంద్రయ్య, మర్రి రాజశేఖర్, కిల్లికృపారాణి వంటి నేతలు ఎమ్మెల్సీ పోస్టులను ఆశిస్తున్నారు.కానీ జగన్ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపారు.వైసీపీ అధికారంలోకి రాగానే తమకు మంచి పదవులు వస్తాయని ఆ సీనియర్ నేతలు ఆశించారు. ఎన్నికలకు ముందు తాము పడ్డ కష్టాన్ని జగన్ గుర్తిస్తారనుకున్నారు.
అయితే శాసనమండలి రద్దు యోచనతో వారికి ఫ్యూచర్ కనిపించటంలేదు.. దీంతో గత కొన్నాళ్లుగా సీనియర్ నేతలు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ప్రతి పథకంలో తెలుగుదేశం పార్టీ అవినీతి ఉందని ఎలుగెత్తి చాటుతున్నప్పటికీ వారు మాత్రం నోరుమొదపడం లేదు. వైసీపీలో కొద్ది మంది మాత్రమే విపక్షాల విమర్శలను ఖండిస్తున్నారు.
ఇలా జగన్ తాను మాట ఇచ్చిన వారికి భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం లేదన్న స్పష్టత రావడంతో వారి గొంతులు మూగబోయాయన్న టాక్ వైసీపీలో బలంగా విన్పిస్తుంది.తమకు పార్టీలో భవిష్యత్ ఉందనుకుంటేనే నేతలు పార్టీలో యాక్టివ్గా ఉంటారు ఉంటారు. లేకుంటే మొహం చాటేస్తారు.
వైసీపీలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది.ఇది కొద్దిగా పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ప్రతిపక్షాల దాడిని సమర్థంగా ఎదుర్కోగల కొందరు వైసిపి నేతలు మూగనోము పట్టడాన్ని అధినేత జగన్ గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం అని ఆ వర్గాలు చెబుతున్నాయి