మోడీ – జగన్ భేటీ అనే సందర్భం వచ్చిన ప్రతీసారీ “కేంద్ర కేబినెట్ లోకి వైకాపా ఎంపీలు” అనే వార్త హల్ చల్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం వీళ్లిద్దరూ భేటీ అవ్వకుండానే ఆ విషయం హల్ చల్ చేస్తుంది. దానికి కారణం… బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షం జేడీయూ కు కేబినెట్ లో చోటు కల్పించే దిశగా మోడీ అడుగులు వేస్తున్నట్లు తెలియడమే. ఇందులో భాగంగా ఇదే ఊపులో వైకాపా కు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించేస్తే ఒకపని అయిపోతుందని అమిత్ షా భావిస్తున్నారంట!
ఇదే నిజమయ్యి.. ఒకటో రెండో కేంద్రమంత్రి పదవులు నిజంగా మొడీ – అమిత్ షా ద్వయం జగన్ కు ఆఫర్ చేస్తే… జగన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!! ఇంకేముంది ఎగిరి గంతేస్తారు.. వెళ్లి కండువాలు కప్పెసి, దేవుడి ఫోటోలు బహుకరించేస్తారు అనేది ఒక వర్గం మాట! కానీ… ఈ విషయంలో జగన్ రెండు మూడు ఆలోచనలు చేసే అవకాశాలు ఉనాయని అంటున్నారు విశ్లేషకులు!
కేంద్ర కేబినెట్ లోకి పిలవగానే తగుదునమ్మ వెళ్లిపోయే పరిస్థితులు జగన్ కి లేవని.. జగన్ ఆలోచన విధానం కూడా ఈ పూటకి గడిస్తే చాలు అనుకునే స్థాయిలో లేదని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో వైకాపాకి బలమైన ఓటు బ్యాంకు ఎస్సీ, మైనార్టీ ఓటు బ్యాంకు! ఇప్పటికే ఎవరు అవునన్నా కాదన్న హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీతో జతకట్టి.. తన పునాధులకు ఇబ్బందులు తెచ్చుకోరని అంటున్నారు.
ఇదే క్రమంలో “ప్రత్యేక హోదా” ఎవరు ఇస్తారని మాట ఇస్తే.. కేంద్రంలో వారితో జతకడతాం అని ఇప్పటికే జగన్ ప్రకటించేశారు కూడా. చంద్రబాబులాగా… “ముందుగా హోదా కావాలని.. అనంతరం ప్యాకేజీనే ముద్దని” అనే టైపు జగన్ కాదు కాబట్టి… ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నుంచి క్లారిటీ వచ్చే వరకూ జగన్ ఆ రిస్క్ తీసుకోరనే అంటున్నారు విశ్లేషకులు. దీంతో.. ఒక్క హోదా విషయంలో బీజేపీ క్లారిటీ ఇస్తే… ఏపీకి అన్ని రకాలుగానూ పండగేనన్న మాట!