PUBG Mobile India: పబ్ జీ.. ఈ పేరు తెలియని వారు ఉండరు.. అంత క్రేజ్ ఉంది ఈ గేమ్ కి.. పబ్జి గేమ్ అంటే చాలు చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దానికి అతుక్కుపోతుంటారు.. పబ్జి కోసం ఇప్పటికీ చాలామంది నిరీక్షిస్తున్నారు.. అయితే అంత క్రేజ్ ఉన్న పబ్జి గేమ్ చైనా దేశానికి చెందినది కావడంతో.. గత సంవత్సరం సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. భారత్ – చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం ఆనంతరం కేంద్ర ప్రభుత్వం 118 మొబైల్ యాప్ లపై నిషేధం విధించింది. అప్పటి నుంచి పబ్జి గేమ్ భారత్లో ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో పబ్జీ సంస్థ తన ఆడియన్స్ కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ వారిలో ఆసక్తి రేకత్తించేలా చేసింది.. తాజాగా పబ్ జీ మాతృ సంస్థ పబ్ జీ పేరును “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” గా చేంజ్ చేస్తూ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది..
దీంతో పబ్జి గేమ్ త్వరలో ని భారతదేశంలో విడుదల కాబోతుంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో పబ్జి గేమ్ ను తిరిగి ప్రారంభించేందుకు ఉద్యోగాల నియామకం వేగవంతం చేసింది. క్రాప్టన్ సంస్థ ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డెన్ లో పోస్టింగ్ లను అప్డేట్ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్ పోస్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించింది..
దీంతో పాటు ప్రధాన మోడీ పీఏం కేర్స్ కు రూ.1.5 కోట్లు విరాళం ప్రకటించింది. తమ వంతు సాయంగా ఇండియా ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటు క్రాఫ్టన్ సీఈవో చంగ్హాస్ కిమ్ ప్రకటించారు.. దీనికి తోడు “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా” పోస్టర్స్ రిలీజ్ చేయడంతో పబ్జి ప్రియులు త్వరలోనే ఈ గేమ్ రానుందంటు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పబ్జి ప్రియులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.