Reliance Jio: టెలికాం రంగంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఈ సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.. గూగుల్ తో కలిసి అభివృద్ధి చేసిన ఈ “జియో నెక్స్ట్” స్మార్ట్ ఫోన్ అత్యంత తక్కువ ధరకి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు..!!
రిలయన్స్ నుంచి ఇప్పటికీ జియో ఫోన్, జియో ఫోన్ 2 తరువాత వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే. ఇప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్న ఫోన్ పూర్తి స్థాయి స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్లో ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ వెర్షన్ ను అభివృద్ధి చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్, వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్ – అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, అగుమెంట్ రియాలిటీ తో కూడిన స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ శామ్ సంగ్, రియల్ మి, షియోమీ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలవనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర ఎంతో తెలుపలేదు. అయితే ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుందని తెలిపారు.