Telangana Assembly Polls: కాంగ్రెస్ తో పొత్తునకు సీపీఎం కటీఫ్ చెప్పింది. ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయానికి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టులకు చేరో రెండు సీట్లు కేటాయింపునకు తొలుత కాంగ్రెస్ తో ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సీపీఎం అడిగిన స్థానాలు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పొత్తు పెటాకులైంది. కాంగ్రెస్ వైఖరి కారణంగా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు కేటాయిస్తామన్న సీట్ల విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని చెప్పారు.
అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తమ్మినేని. రాష్ట్ర వ్యాప్తంగా 20 సీట్లలో పోటీ లో ఉంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పోటీ చేసే 17 స్థానాలను తమ్మినేని ప్రకటించారు. భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు. వైరా, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్లు, భువనగిరి, హూజూర్ నగర్, కోదాడ, జనగామ, ముషీరాబాద్, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరులో లో పోటీ చేస్తామన్న చెప్పిన తమ్మినేని.. రెండు మూడు రోజుల్లో అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. వీటిలోనూ ఒకటి రెండు చోట్ల మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు.
తమకు తొలుత భద్రాచలం కేటాయిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పిందని అన్నారు తమ్మినేని. పాలేరు విషయంలో తామే వెనక్కు తగ్గామని అన్నారు. వైరా ఇస్తామని తాము చెప్పలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అబద్దమాడారని అన్నారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో వారికి మద్దతు ఇస్తామని తమ్మినేని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదు అన్నదే ఉభయ కమ్యూనిస్టుల ప్రయత్నమని తెలిపారు. బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్లో తాము తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. తమకు ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇస్తామని అనడం సరికాదని అయన అన్నారు.
Chandrababu: చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ