Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. ఇసుక అక్రమ తవ్వకాలు మరియు అవకతవకలు జరిగాయని చంద్రబాబు పై బుధవారం ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నాళ్లు డ్వాకా సంఘాల ఆధ్వర్యంలో, కొన్నాళ్లు ఇసుక తవ్వకాలు డ్వాక్రా సంఘాలు మరి కొన్నాళ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని, దీని వల్ల అప్పటి ప్రభుత్వ పెద్దలు లబ్ధి పొందాలని సీఐడీ పేర్కొంది.
ఎఫ్ఐఆర్ లో ఏ 1 గా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏ 2గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ 3గా అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ 4 గా అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకట రెడ్డి పిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అప్పటి చంద్రబాబు సర్కార్ పై సీఐడీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇప్పటి వరకు అరడజను కేసులను సీఐడీ నమోదు చేసింది. స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్, బేవరేజెస్ కార్పొరేషన్, ఇసుక అక్రమాలపై సీఐడీ కేసులు నమోదు చేయగా, అంగళ్లు ఘటనకు సంబంధించి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుల పరంపర ఇంకా కొనసాగుతుందని భావిస్తున్నారు.
Telangana Assembly Polls: చంద్రబాబు మిడల్ డ్రాప్ ఎవరి కోసం ..? ఏ పార్టీ ప్రయోజనం కోసం అంటే..?