Nama Nageswararao: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇటీవలే ఆయన నివాసంతో పాటు కార్యాలయాలలో, డైరెక్టర్ నివాసాల్లో ఈడీ రెండు రోజుల పాటు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలక పత్రాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. బ్యాంకు రుణాల మళ్లింపు అభియోగాలపై నామాతో పాటు మథుకాన్ డైరెక్టర్ లపై కేసులు నమోదు అయి ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఈ నెల 25న విచారణకు హజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నామా తో పాటు మధుకాన్ కేసులో నిందితులు అందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.
జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఇతర అవసరాలకు మళ్లించినట్లు మధుకాన్ గ్రూపుపై అభియోగాలు ఉన్నాయి.