NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Governor Tamilisai: గవర్నర్ తమిళి సై ప్రసంగంలో బిగ్ ట్విస్ట్ .. ఆ అంశాలు దాటవేత

Telangana Governor Tamilisai: తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని పేర్కొన్నారు.

ప్రజాకవి కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళి సై.. దాసరథి సూక్తులతో ముగించారు. అయితే ప్రభుత్వ ప్రసంగంలో పలు అంశాలను గవర్నర్ దాట వేశారు. 2014 లో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేసిన యూపీఏ ప్రభుత్వానికి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే పేరాను గవర్నర్ తమిళి సై చదవలేదు. పదేళ్ల నిర్బంధ పాలనలో తెలంగాణ ప్రజలకు విముక్తి కల్గిందన్నారు. మార్పు పలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తొందర్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. 50వేల 275కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థలు కొనసాగుతున్నాయని, పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు.

గడిచిన తొమ్మిదన్నరేళ్లలో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని పేర్కొన్నారు.  ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పని చేశాయని అన్నారు. కార్యనిర్వహణ వ్యవస్థలో విలువలను పునరుద్దరిస్తామని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందని పేర్కొన్నారు. అణచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందని అన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజా వాణి చేపట్టామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామన్నారు. తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఉందన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో మా పాలన దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు. అమరవీరుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని పాలన సాగిస్తామని చెప్పారు.

స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం..గౌరవ భృతి ఇస్తామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, రెండు లక్షల రుణ మాఫీపై త్వరలోనే కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది.

KCR: ఆసుపత్రి నుండి కేసిఆర్ డిశార్చ్ .. రేపటి నుండి పరామర్శలు

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N