YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలనీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. సోమవారం పాదయాత్రలో భాగంగా షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడటం జరిగింది. ఈ క్రమంలో షర్మిల కారు ద్వంసం అయింది. అదే సమయంలో ఆమె ముఖం పై గాయాలు కూడా అయ్యాయి. అయితే మంగళవారం ధ్వంసమైన కారులతోనే… వైయస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి రాజభవన్ రోడ్డులో వైయస్సార్ షర్మిలను పోలీసుల అరెస్టు చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపల ఉండి నిరసన తెలపడంతో.. డోర్ లాక్ చేయటంతో.. కారుతోపాటు లోన ఉన్న షర్మిలాను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అనంతరం కారు డోరు తెరిచి ఆమెను బలవంతంగా కిందకు దించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తిల పరిస్థితుల మధ్య ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి షర్మిలని తరలించడం జరిగింది. అయితే తనని కారుతోపాటు క్రేన్ లో పోలీసులు తీసుకెళ్లడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్ కి చూపించడానికి వెళ్తుంటే అడ్డుపడతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ..?అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోపక్క ఒక మహిళ రాజకీయ నేతను ఈ రీతిగా పోలీసులు.. క్రేన్ సహాయంతో స్టేషన్ ని తరలించడాని నేటిజన్ లు విమర్శలు చేస్తున్నారు. ఒక నియంత మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు అది కూడా ప్రజల సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పేంటి..? బాధ్యత గల రాజకీయ నేతగా.. రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమెపై ఈ రీతిగా పోలీసులు వ్యవహరించటం దారుణమని అంటున్నారు.
#WATCH | Hyderabad: Police drags away the car of YSRTP Chief Sharmila Reddy with the help of a crane, even as she sits inside it for protesting against the Telangana CM KCR pic.twitter.com/ojWVPmUciW
— ANI (@ANI) November 29, 2022