NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ద‌ళితుల కోసం ఇంకో సంచ‌ల‌న హామీ ఇచ్చిన కేసీఆర్‌

KCR: గ‌త కొద్దికాలంగా ద‌ళిత సంక్షేమం గురించి ఫోక‌స్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విష‌యంలో విమ‌ర్శ‌లు సైతం లైట్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. హుజురాబాద్ లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు గురించి విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసీఆర్ తిప్పికొడుతున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ద‌ళితుల‌కు ఇంకో వ‌రం ప్ర‌క‌టించారు.

Read More : KCR: హుజురాబాద్‌లో కేసీఆర్ కొత్త ఆప‌రేష‌న్ ఏంటో తెలుసా?

ల‌క్ష కోట్లైనా ఖ‌ర్చుకు రెడీ
అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని హామీ ఇచ్చారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందన్నారు కేసీఆర్ . అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలంటూ.. దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.

Read More : KCR: కేసీఆర్ పాల‌న‌పై ష‌ర్మిల సెటైర్లు

ద‌ర‌ఖాస్తుల‌కు ప్ర‌త్యేక యాప్

తెలంగాణ లో ఎస్సీల ఆర్థిక సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వెబ్‌ పోర్టల్‌ తోపాటు యాప్‌ను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది. దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

author avatar
sridhar

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N