Mahesh babu : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన ప్రాజెక్ట్ మరో హీరో చేతికి వెల్లడం సర్వ సాధారణమే. అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల కొన్ని సార్లు క్రేజ్ పెరిగితే కొన్ని సార్లు మాత్రం ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానా అని ఫీలయిన సందర్భాలున్నాయి. ఇది పక్కన పడితే ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ ఓ టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ నిర్మించబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ కరోనా కారణం వల్ల ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు ఆగిపోతూ వస్తోంది. ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్ మొదలవనుందట.
అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ ని మేకర్స్ తీసుకోవాలనుకున్నారు. అల్లు అరవింద్ తో కలిసి నిర్మించనున్న ఈ సినిమాను 2022లో ప్రారంభించాలనుకుంటున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని 3డి పార్ఫ్మాట్ లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే సీతాదేవి పాత్రలో నటించనున్నారట. కాగా రామాయణం 3డి ట్రయాలజీ మూవీ లో మహేష్ బాబు, హృతిక్ రోషన్, దీపికా పదుకొనేలను ఎంపిక చేయాలని అరవింద్- మధు మంతెన ప్లాన్ చేశారు. అయితే మహేష్ ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పినట్టు సమాచారం.
Mahesh babu : ఆదిపుష్ 3డి లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.
ఇక రామాయణం 3డి మూవీలో హృతిక్.. రావన్ పాత్రలో, దీపిక సీతగా కనిపిస్తుందని మేకర్స్ అంటున్నారు. కాగా వాస్తవంగా మహేష్ చేయాల్సిన పాత్రనే హృతిక్ ఓకే చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక మేయిన్ లీడ్ రోల్ రాముడి పాత్రకోసం ఎవరిని ఎంచుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి భారీ ప్రాజెక్ట్ లో రాముడి పాత్రకి టాలీవుడ్ స్టార్ నటిస్తాడా లేక బాలీవుడ్ హీరో నటిస్తాడా చూడాలి. ఇప్పటికే ఆదిపుష్ 3డి లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. మరి ఇందులో కూడా రాముడిగా ప్రభాస్ ని తీసుకుంటారా..లేక మరెవరినైనా తీసుకుంటారా చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!