KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో రాజకీయాలు చేసే పొలిటీషియన్లలో టాప్లో ఉంటారనే సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే దళిత బంధు పథకం విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఎన్నికల స్టంట్ అనే విమర్శ వినిపిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read More : KCR: కేసీఆర్ ఇంకో వరం… ఔను హుజురాబాద్ కోసమే!
కేసీఆర్ ఏమంటున్నారంటే..
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దళిత బంధు పథకంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఎన్నికలు ఇంకా రెండున్నర ఏళ్లకు వస్తాయన్నా సీఎం కేసీఆర్….ఈ పథకంపై వంకర తింకర తిట్టేటోళ్లు చాలా మంది ఉన్నారన్నారు. రైతుబంధు పథకం కోసం ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నట్లు, ఈ పథకం కోసం శ్రమించానని అన్నారు. ఖచ్చితంగా ప్రయోజనాలు చూసుకునే తాము పనులు చేస్తామని స్పష్టం చేశారు.తనకు రాజకీయ స్వార్థం ఉంటే దళిత బంధు పథకం గజ్వెల్ లోనే పెట్టేవాళ్లం కదా అని తెలిపారు.
Read More : KCR: కేసీఆర్కు హుజురాబాద్ భయం పట్టుకుంది.. . దానికి ఉదాహరణ ఇదే!
రాజకీయం చేస్తం…
రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని తనపై విమర్శలు చేసేవారు రాజకీయ నాయకులు రాజకీయం చేయొద్దా అని కేసీఆర్ ప్రశ్నించారు. రక్షణ నిధి పేరిట ప్రతి జిల్లాకు నిధులు కేటాయిస్తున్నట్లు, రూ. 10 లక్షలు ఒట్టిగ పంచిపెట్టుడు కాదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయొద్దని సూచించారు. శాశ్వతంగా అధికారం ఎవ్వరికీ ఉండదని..ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు.