KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వరాల జల్లు కొనసాగుతోంది. ఇప్పటికే దళితులకు వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా బీసీలకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బిసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారికి తీపికబురు అందించారు.
Read More: KCR: కేసీఆర్కు హుజురాబాద్ భయం పట్టుకుంది.. . దానికి ఉదాహరణ ఇదే!
కేసీఆర్ ఏమంటున్నారంటే…
తెలంగాణ లో వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్ లో ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు.
Read more : KCR: ఈటల ఇలాకా నుంచి ఆ స్కీం ఆవిష్కరించి కొత్త గేమ్ మొదలుపెడుతున్న కేసీఆర్!
కేసీఆర్ ఆర్డర్ ఇది..
తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకోసం మరో 6000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం చెప్పారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖ ను సీఎం ఆదేశించారు. దాంతో..మొదటి విడత తో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమ లకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతేకాకుండా… ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.