KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు ఎవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుండగా, ఫలితాలపై ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వివిధ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా రావడంతో వారు ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు.
మరో పక్క బీఆర్ఎస్ కూడా తగ్గేదిలే అన్నట్లుగా తమ గెలుపు ఖాయమని, మరో సారి ముఖ్యమంత్రి గా కేసిఆర్ పగ్గాలు చేపట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తొంది. ఎగ్జిట్ పోల్స్ .. ఎగ్జాట్ పోల్స్ కాదని .. విజయం తమదే అన్న దీమాతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ క్రమంలోనే ప్రగతి భవన్ కు రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు కేబినెట్ భేటీకి కేసిఆర్ రంగం సిద్దం చేసుకున్నారు. ఈ తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కల్గించే ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫోటోను పోస్టు చేసిన కేటిఆర్.. హ్యాట్రిక్ లోడింగ్ 3.0. వేడుకలు చేసుకోవడానికి సిద్దంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా కార్యకర్తలు, నేతల్లో కేటిఆర్ జోష్ నింపారు. కేటిఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోరాహోరీగా జరిగిన తెలంగాణ ఎన్నికల పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో.. ప్రజలు ఎవరికి పట్టం కట్టారో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.
Telangana Exit Poll Result: తెలంగాణలో గెలిచేది ఆ పార్టీయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా
Hattrick Loading 3.0 👍
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
— KTR (@KTRBRS) December 2, 2023