Actress Sirisha: రాములమ్మ సీరియల్లో మెయిన్ లీడ్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శిరీష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఈ సీరియల్ అనంతరం చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో నటించి మరింత పాపులర్ అయింది. ఏ సీరియల్ కి కూడా లేని విధంగా ఈమె నటించిన సీరియల్స్ కి అంత ప్రేక్షకు ఆదరణ దక్కింది. సాధారణంగా ప్రస్తుతం ఉన్న యాక్ట్రెస్ కొందరు మాత్రమే ఇటువంటి పాపులారిటీ సంపాదించుకోగలరు. ఎందుకంటే.. ప్రతి యాక్టర్ నటించడం కామన్… కానీ వారికి ఇచ్చిన క్యారెక్టర్ లో జీవిస్తేనే వారికి మంచి పాపులారిటీ దక్కుతుంది. ఏదో సీరియల్లో నటించాం కదా మన పని అయిపోయింది ఇక వెళ్ళిపోదాం ఇలా అనుకుంటే వారు ఎప్పటికీ ఎదగలేరు. తాము నటించిన సీరియల్ ఎంత బాగా వస్తుంది తమ నటన బాగుంటుందా లేదా ఏమైనా మార్చుకోవాలా అని తెలుసుకుని వాటిని చేంజ్ చేసి నటించిన వారు మాత్రమే చిరస్థాయికి ఎదుగుతారు.
అలా తెలుసుకుని నటనలో ఆరితేరిన వారు పలువురు హీరో మరియు హీరోయిన్లు కూడా అయ్యారు. వారిలో హీరో యష్ కూడా ఒకరు. ఒకప్పుడు కన్నడ సీరియల్స్ లో నటించిన యష్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయ్యాడంటే దీనంతటికీ కారణం ఆయన నటనే అని చెప్పుకోవచ్చు. సీరియల్స్ పై వచ్చిన డబ్బును తన కాస్ట్యూమ్స్ కు పెడుతూ ఒక డైరెక్టర్ మదిలో పడ్డాడు. ఈ హీరోని పాన్ ఇండియా హీరో చేయాలనుకున్న ఓ డైరెక్టర్ అలానే చేసేసాడు. అలా తనకి వచ్చిన డబ్బును కాస్ట్యూమ్స్ పై పెట్టి స్టార్ డైరెక్టర్ కంటపడి ఎలాగో అలాగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం యష్ పాపులారిటీ అంటే వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఈయనకున్న పాపులారిటీ మరే హీరోకి కూడా లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకున్నాడు.
అలా శిరీష కూడా మంచి పాత్రలను ఎంచుకుని దూసుకుపోయింది. హీరోయిన్ స్థాయికి ఎదగలేకపోయినా బుల్లితెర పైనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గతంలో అనేక సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం ఎటువంటి సీరియల్స్ లోను నటించడం లేదు. ఇక బుల్లితెరపై మనని నవ్వించే శిరీష పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉమ్మడి తెలంగాణలో పుట్టి పెరిగి హైదరాబాద్ కి షిఫ్ట్ అయి ఏం చేయాలో తెలియక చాలా కష్టాలను అనుభవించిందట. వీరిది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకానొక సమయంలో వీరి ఇంట్లో రైస్ కూడా ఉండేది కాదట. అప్పుడు పస్తులు ఉండే వాళ్ళమని.. అటువంటి సమయంలోనే పేరెంట్స్ తో కలిసి మిర్చి బండి నడిపిస్తూ వర్షంలో తడుస్తూ.. మిర్చిలని పార్సిల్ కడుతూ చాలా కష్టపడేదాన్ని అంటూ వెల్లడించింది శిరీష.
అంతేకాకుండా ఒక్కోసారి మా అక్క సైతం 75 రూపాయల కోసం సేల్స్ గర్ల్ గా వెళ్లేదని వెల్లడించింది. అంతేకాకుండా తన తల్లి రెండువేల కోసం వాచ్మెన్ డ్యూటీ కూడా చేసేదంటూ కన్నీరు మున్నిరు అయ్యింది శిరీష. ఇక ప్రస్తుతం ఈ స్థాయికి ఎదిగి మళ్లీ బయటికి వెళ్లి ఒక 5000 కోసం జాబ్ చేస్తానంటే చీప్ గా చూస్తున్నారని వెల్లడించింది. అదేవిధంగా నేను సీరియస్ కోసం ఎప్పుడు అంతా ఇంతా అని డిమాండ్ చేయలేదని ఇచ్చినంత తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది శిరీష. ఇక తనపై లేనిపోని రూమర్స్ క్రియేట్ చేశారని బాధపడింది. ఇలా తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఫేస్ చేసి ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటుంది శిరీష. ఏదేమైనా సుఖంలో ఉన్నప్పుడు ఎవరైనా తోడు వస్తారు కష్టంలో ఉన్నప్పుడు కూడా తోడు వచ్చేవారే మన ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలా ఈ ముద్దుగుమ్మ తన తల్లి మరియు మొత్తం కుటుంబానికి అండగా నిలుస్తూ ఏమీ లేని సమయంలో మిర్చి బండి నడిపేది..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!