Brahmamudi: ఇటీవలే మన స్టార్ మా ప్లాట్ఫారంపై ప్రసారం అవుతున్న బ్రహ్మ ముడి సీరియల్ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. వీరు ఇచ్చే ట్రిస్టులతో హార్ట్ ఎటాక్ పుట్టిస్తున్నారు. ఇతర సీరియల్ ఫ్లాట్ ఫారమ్స్ ను ఢీ కొడుతూ స్టార్ మా ముందుకు సాగడానికి మెయిన్ రీసన్ ఇదే. ఒకానొక సమయంలో కార్తీకదీపం ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో ప్రస్తుత కాలంలో బ్రహ్మముడి అంత క్రేజ్ ని సంపాదించుకుంది.
తిండి తిప్పలు మానేసి కూడా బ్రహ్మముడి సీరియల్ చూసేవారు అనేకమంది ఉన్నారు. అంత మేరా ప్రేక్షకుల్లోకి వెళ్ళింది మరి ఈ సీరియల్. 7:30 అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు ప్రజలు. చక్కని కథాంశంతో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరికి కూడా ఎనలేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్స్ నటిస్తున్న రాజు మరియు కావ్యాల పాత్రలలో నటిస్తున్న మానస్, దీపిక యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు డై హార్ట్ ఫాన్స్ అయ్యారు.
ఈ సీరియల్ లో వీరు నటిస్తున్నారు అని చెప్పడం కంటే జీవిస్తున్నారు అని చెప్పడం బెటర్. ఇందువల్లేనేమో ఈ సీరియల్ ఆడియన్స్ కి బేభత్సంగా దగ్గర అయింది. ఇక ఇటీవలే కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కార్తీకదీపం రాకతో బ్రహ్మ ముడి సీరియల్ టైమింగ్స్ మారనున్నట్లు తెలుస్తుంది. మార్చ్ 25వ తేదీ నుంచి బ్రహ్మముడి సీరియల్ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.
ఇక రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమవుతున్న నాగపంచమి సీరియల్ బదులు ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఇక నాగ పంచమి సీరియల్ టైమింగ్ ని కూడా మార్చేశారు. బ్రహ్మ ముడి సీరియల్ ని 45 నిమిషాల పాటు టెలికాస్ట్ చేయబోతున్నారు. మార్చ్ 25 నుంచి బ్రహ్మముడి సీరియల్ 8 నుంచి 8: 40 వరకు ప్రసారం కానుంది. ఇక మరో 10 నిమిషాలు పెరగడంతో ఈ సీరియల్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రోజు ఇంకో ఒక్క నిమిషం వస్తే బాగుంటుంది అని అనుకునే వారికి ఇది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!