బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 540 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు ఆగుష్టు 27 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. వసు తన మనసులోని మాటను రిషికి. చెప్పగా రిషి కూడా వసు ప్రేమను అంగీకరిస్తాడు.. ఇప్పటి నుంచి మన ప్రేమ కధ మొదలు అని అంటాడు. వసు ముందు నీ దృష్టి అంతా చదువు మీద పెట్టు అని రిషి వసు దగ్గర మాట తీసుకుంటాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. వసు, రిషిలు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తుంటారు. ఇక రిషి ఇల్లు వచ్చేసింది వసుధార వెళ్లు రెస్ట్ తీసుకో అంటాడు. అప్పుడేనా అంటుంది వసు.
వసు… రిషిల ప్రేమకధ మొదలు :
ఈరోజుకు రెస్ట్ తీసుకో రేపటి నుంచి నీ ధ్యాస మొత్తం ఒకేదాని మీద ఉండాలి అంటాడు రిషి. బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు రిషి. సరే సార్ అని చెప్పి గుడ్ నైట్ అంటుంది వసు.వసును డ్రాప్ చేసాక కారులో వెళ్తుంటాడు రిషి. మధ్యలో కారును ఆపి కారు బానెట్ మీద నిలబడి చాలా సంతోషంగా ఉంటాడు. ఈ రాత్రి, ఈ ఆనందం చాలా బాగుందిm రిషీంద్ర భూషణ్ నీ లైఫ్ ఇప్పుడు నీకు చాలా బాగుంది. లైఫ్ చాలా పాఠాలు నేర్పిస్తుంది నాకు. నా లైఫ్ కు బిగ్ థాంక్స్ అని అంటూ తన నీడను చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడూ ఇలాగే నిబ్బరంగా సహనంగా నిలబడు.ఎన్ని సమస్యలు వచ్చినా ఒప్పుకో వసుధర నీది నువ్వు తన ప్రాణం. తన ఆశయం నువ్వే నిలబెట్టు అని అనుకుంటాడు రిషి.
రిషి గురించి ఆలోచిస్తున్న గౌతమ్, మహేంద్ర :
సీన్ కట్ చేస్తే మహీంద్ర, గౌతమ్ ఇద్దరూ మెట్ల మీద కూర్చొని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో రిషి ఇంటికి వస్తాడు.వాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడే అడిగేద్దాం అంటాడు గౌతమ్. ముందు నువ్వు అడుగుతావా లేక నన్ను అడగమంటావా అంటాడు మహీంద్రా. దీంతో పెద్దవారు కదా మీరే అడగండి అంటాడు. రిషి రాగానే రా రా కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అంటాడు గౌతమ్.దీంతో నేను బాగా అలసిపోయాను.ఇప్పుడు నా వల్ల కాదు నేను రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు రిషి. తన గదిలోకి వెళ్తూ ఉండగా జగతి కనిపిస్తుంది.
జగతికి థాంక్స్ చెప్పిన రిషి :
జగతి వెనుక వసుధర ఉన్నట్టు ఊహించుకుని థాంక్యూ మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.జగతికి ఏమి అర్ధం కాక ఏమైందిరిషికి అని అనుకుంటుంది.ఇక వసుధర మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వెళ్లాక కూడా ఫోన్లో రిషి ఫోటోనే చూస్తూ, రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి కూడా వసుధర ఫోటోను చూస్తూ వసుధర ఏం చేస్తుందో అనుకుంటాడు. తనే ఫోన్ చేయాలని నేను ఎందుకు ఎదురు చూడాలి అని రిషి అనుకుంటాడు అలాగే వసు కూడా సార్ కంటే ముందే నేను మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటుంది. అయినా ఎగ్జామ్స్ అయిపోయేదాకా నేనే కలవకూడదని చెప్పా కదా. మళ్లీ నేనే మెసేజ్ చేస్తే ఏం బాగుంటుంది అని అనుకుంటాడు రిషి. సార్ కలవొద్దు.. మాట్లాడొద్దు అని చెప్పారు కదా. ఆ రూల్ ను నేను బ్రేక్ చేయడం ఎందుకు అని అనుకుంటుంది వసు.
సాక్షి, దేవయానిల మరొక కుట్ర :
మరోవైపు సాక్షి, దేవయాని ఇద్దరు కలిసి వసు, రిషి గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో సాక్షి ఆంటీ రిషి నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అంటుంది.ఈ పరీక్షలు అయిపోనీ సాక్షి ఆ తర్వాత రిషి, వసుధర ఇద్దరూ దూరం అవుతారు అంటుంది దేవయాని. అప్పుడు రిషిని మన వైపుకు తిప్పుకుందాం అంటుంది. ఇంతలో వాళ్ళకి ధరణి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది.
కొడుకు కోసం పరితపిస్తున్న జగతి :
సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జగతి కాఫీ పట్టుకొని రిషి రూమ్ కు వెళ్తుంది కానీ అప్పటికి నిద్రపోతున్న రిషి బెడ్ దగ్గర గౌతమ్, మహీంద్ర ఇద్దరూ ఉంటారు. ఇంతలో దేవయాని వచ్చి ఏం గూడు పుఠాని చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అని చెప్పి మహీంద్రా, గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఏమి. జగతి ఏంటి అని అడగగా అక్కయ్య రిషికి కాఫీ ఇద్దామని వచ్చా అంటుంది… ఇక వసుధార కూడా నిద్ర లేచి రిషి గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!