Shobha Shetty: రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మౌనిత అనే ఓ బిరుదును పొందిన శోభ శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర పోషించి ఎంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా తనలో ఉన్న మౌనిత అని బయటకు తీసుకొచ్చింది. బిందు మాధవి తరువాత లేడీ టైగర్ గా పేరుగాంచింది.
సాధారణంగా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన అమ్మాయిలు కొందరు గట్టిగా మాట్లాడినప్పటికీ అంతే గట్టిగా డిఫైన్డ్ చేసుకోలేరు. కానీ అలా చేసుకున్న వారికి మాత్రమే బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ దక్కుతుంది. అలా బిందు మాధవి తనని తాను డిఫైన్డ్ చేసుకుని టైటిల్ని గెలుచుకుంది. ఇక బిగ్ బాస్ 7 లో శోభా శెట్టి కూడా అలానే తనను తాను డిఫైన్డ్ చేసుకున్నప్పటికీ కప్ మాత్రం గెలవలేకపోయింది. కానీ రియల్ మౌనితగా పేరుపొందింది.
ఇక ఇటీవలే శోభా శెట్టి తన ప్రియుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అనంతరం బయటకి వచ్చిన శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొనడమే కానీ ఏ సీరియల్ కి సైన్ చేసినట్లు కనిపించడం లేదు. ఇక కార్తీకదీపం 2 రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇందుకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో మౌనిత అలియాస్ శోభా శెట్టి ఎక్కడా కనిపించలేదు.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు యశ్వంత్ తో కలిసి సూరత్ కి వెళ్ళింది. ఆమె బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినవి కొనుగోలు చేయడానికి వెళ్లినట్లు ఆ వీడియోలో వెల్లడించింది. ఈమె సూరత్ వెళ్లి మ్యానుఫ్యాక్చర్ షాప్ లో తక్కువ ధరలో చీరలు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా హోల్సేల్ ధరకు తాను చీరలు అమ్మనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా తన వద్దకు మేకప్ చేయడం నేర్చుకోవడానికి వచ్చేవారు బిజినెస్ పెట్టుకునేలా ప్లాన్స్ కూడా చేపట్టాలని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా.. సీరియల్స్ పెద్ద వేస్ట్ అనుకున్నావు కదా. అందువల్లే సీరియల్స్ ని వదిలేసి డబ్బు కోసం ఈ రంగంలో దిగావా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!