అసలే మాయదారి కరోనా. ఏ బిజినెస్ పెడదామన్నా.. ఇప్పుడు నడుస్తుందో? నడవదో? అన్న టెన్షన్ లో ఉన్నారా? అవును.. ఈ సమయంలో ఏ వ్యాపారం అయినా నష్టాలే ఎక్కువ. కరోనా వల్ల వ్యాపార రంగం మొత్తం దెబ్బతిన్నది. అందుకే… ఈ క్లిష్ట సమయంలో ఆచితూచి అడుగేయాలి.
ఇటువంటి భయంకర కరోనా సమయంలో కూడా పాల వ్యాపారం ప్రారంభించి లక్షలు సంపాదించవచ్చు. ఎందుకంటే పాలు అనేవి నిత్యావసర వస్తువు. ప్రతి ఇంట్లో ప్రతి రోజు పాలు ఉండాల్సిందే. పాలు లేని ఇల్లు ఉండదు. కరోనా ఉన్నా.. ఇంకేదైనా ఉన్నా సరే.. పాల బిజినెస్ అనేది జరగాల్సిందే. పాలకు అంత డిమాండ్ ఉంది ఇప్పుడు.
సో… పాల బిజినెస్ ప్రారంభించాలంటే ముందు కావాల్సింది ఒక యూనిట్. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రభుత్వం ముద్రా స్కీమ్ కింద పాల బిజినెస్ కు లోన్ కూడా ఇస్తుంది. మిల్క్ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి కనీసం 16 లక్షలు ఖర్చు అవుతుంది. ముద్రా స్కీమ్ కింద కనీసం 10 నుంచి 12 లక్షల వరకు లోన్ వస్తుంది. అంటే మీరు ఒక 4 నుంచి 5 లక్షల వరకు సమకూర్చుకుంటే వెంటనే పాల బిజినెస్ ప్రారంభిచవచ్చు.
ఇక.. మిల్క్ యూనిట్ ను ప్రారంభించాక.. పాలతో పాటుగా పెరుగు, మజ్జిగ, నెయ్యి లాంటి వాటిని కూడా విక్రయించవచ్చు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ను ఏర్పాటు చేసినా చాలు. ఇక.. అన్ని ఖర్చులు పోను నెలకు కనీసం ఓ లక్ష రూపాయల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.
ఒకవేళ మీకు పాల బిజినెస్ ప్రారంభించాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ముందుగా మీ ప్రాంతంలో ఇదివరకే ఉన్న మిల్క్ యూనిట్లను సంప్రదించండి. అలాగే ప్రధాన మంత్రి ముద్ర స్కీమ్ గురించి కూడా ఓసారి బ్యాంక్ కు వెళ్లి కనుక్కోండి. మీకు అన్నీ ఓకే అనుకుంటే వెంటనే ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు.