Diabetes: వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య మధుమేహం.. రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ వస్తుంది.. మధుమేహం కారణంగా వచ్చే అనేక వ్యాధులతో బాధపడుతున్నారు.. షుగర్ వలన ప్రతి ఏడు సెకండ్స్ కి ఒకరి చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.. షుగర్ కి మన పెరట్లోనే పెరిగే 7 అద్భుత ఔషధ మొక్కలతో చెక్ పెట్టవచ్చు..!!
డయాబెటిస్ ని కంట్రోల్ చేసే 7 అద్భుత ఔషధ మొక్కలు..!!
తులసి మొక్క లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది.. తులసి ఆకుల వాసన పీల్చడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని మనందరికీ తెలిసిందే.. పది తులసి ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి పది నిమిషాలు మరిగించాలి ఇలా తయారు చేసుకుని తులసి కషాయాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది.. కలబంద మొక్క ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా పెంచుతారు.. ఆయుర్వేద మందుల తయారీలో కలబందను ఎక్కువగా ఉపయోగిస్తారు.. చర్మ, జుట్టు సంరక్షణ కోసం కలబందను వాడతారు. కలబంద లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఒక చిన్న కలబంద ముక్కను తీసుకుని చెప్పు తీసి అందులో ఉన్న గుజ్జును మెత్తగా చేసుకోవాలి.. కలబంద గుజ్జు ఒక గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగడం వలన షుగర్ వ్యాధి అదుపులోకి రావటమే కాకుండా శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. షుగర్ ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి తిప్పతీగ ఒకటి.. పొలాలలో, రోడ్ల వెంట తిప్పతీగ కనిపిస్తుంది.. తిప్పతీగ నాలుగు ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని 21 రోజులు పరగడుపున తాగడం వల్ల డయాబెటిస్ లెవెల్స్ కంట్రోల్ లోకి రావడం మీరే గమనిస్తారు.. మరి జామ ఆకులు మధుమేహాన్ని తగ్గించే గుణం ఉంటుంది.. జామ ఆకులను కూడా గ్లాసు నీటిలో వేసి మరిగించి ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఏ షుగర్ అదుపులోకి వస్తుంది..
మధుమేహాన్ని నియంత్రించవచ్చు కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది.. ప్రతిరోజు 4 కరివేపాకు ఆకులను నమలడం ద్వారా షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. సీజనల్గా దొరికే నేరేడు పండ్లు కూడా డయాబెటిస్ ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.. నేరేడు పండు, ఆకులు, బెరడు షుగర్ ఔషధాలు తయారీలో వినియోగిస్తారు. రెండు నేరుడు ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ప్రతిరోజు తీసుకుంటే దీనిలో ఉండే ఆయుర్వేద గుణాలు సహజంగా మధుమేహాన్ని అదుపు లోకి తీసుకు వస్తాయి. చివరగా షుగర్ ని అదుపులో పెట్టడానికి ఉపయోగపడేవి బిల్వ పత్రాలు.. శివుడికి ఎంతగానో ఇష్టమైన ఈ బిల్వపత్రాలే మారేడు ఆకులు.. అనేక ఔషధాలు తయారీలో ఈ చెట్టు ఆకులను, బెరడును ఉపయోగిస్తారు.. రెండు మారేడు ఆకులను తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించి ప్రతి రోజూ తాగితే డయాబెటిక్ ఖచ్చితంగా తగ్గుతుంది..