KIM: కిమ్ జాంగ్.. రెచ్చగొడితే అమెరికాపై అణుబాంబు వేయడానికి సిద్ధం అని సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుండి వరుస క్షిపణి పరీక్షలు చేపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కిమ్ జాంగ్… ఉత్తర కొరియా లో కొత్త రూల్ తీసుకొచ్చారు. అదేమిటంటే 30 సంవత్సరాల లోపు మహిళలు… ఎవరు కూడా టైట్ జీన్స్ ధరించకూడదు, జుట్టుకు రంగులు వేయకూడదు, అదేవిధంగా వేసుకున్న బట్టల పై అసభ్యకరమైన రాతలు ఉండకూడదు కొత్త నిబంధనలు తీసుకురావటం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కిమ్ జాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియాలో విదేశీ సంస్కృతి అరికట్టాలనే ఉద్దేశంతో… ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు. దేశంలో రోజురోజుకీ పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతూ ఉండటంతో దానికి చెక్ పెట్టడానికి.. 20 నుండి 30 సంవత్సరాల మధ్య గల యువతులు మరియు మహిళలను టార్గెట్ చేసుకుని కిమ్ జాంగ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఈ క్రమంలో నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే… వెంటనే పెట్రోలింగ్ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెల్లి సదరు మహిళకు కౌన్సిలింగ్ ఇస్తారు అని పేర్కొన్నారు. ఆ సమయంలో పట్టుబడిన వాళ్లు… మరొకసారి రూల్స్ క్రాస్ చేయను.. అని పోలీసులకు హామీ ఇస్తే గాని స్టేషన్ నుండి విడిచిపెట్టే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఉత్తర కొరియా లో జీన్స్, హెయిర్ స్టైల్స్… హెయిర్ కి సంబంధించిన రంగులు వాటిపై ఆంక్షలు విధించి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.