Love Story : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న చిత్రం లవ్ స్టోరీ.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏవో ఏవో కలలే’ అనే పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు..
ఈ చిత్రం ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎంపీ అమిగోస్ క్రియేషన్స్ సంస్థల ప్రతినిధి కె నారాయణ దాస్ నారాంగ్, పి రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప్యూర్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది ప్రత్యేకమైన శైలి.. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. ఈ సినిమా ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!