గత కొద్దిరోజుల నుంచి మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మూడు నెలల క్రితం “మిస్” నిహారిక టు “మిస్సెస్” నిహారిక గా ప్రమోషన్ వస్తుందని, తనకు కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి చెప్పడంతో ఒక్కసారిగా నిహారిక పాపులర్ అయ్యారు. తరువాత కొద్ది రోజులకే తన నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నిశ్చితార్థం అయిన తరువాత నిహారిక తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటున్నారు.
నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకే తన ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి చైతన్యతో కలిసి గోవా వెళ్లిన సంగతి మనకు తెలిసినదే. అయితే దీపావళి పండుగ సందర్భంగా చైతన్యను తన ఇంటికి ఆహ్వానించి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్న ఫోటోలను నిహారిక స్వయంగా తన అభిమానులతో పంచుకున్నారు.
నిహారిక వివాహాన్ని డిసెంబర్ లో జరుగనున్న సంగతి తెలిసినదే. అయితే ఇప్పటికీ మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నిహారిక తన అక్కలు అయిన సుస్మిత, శ్రీజలకు స్పెషల్ పార్టీని ఇచ్చింది. అయితే మెగా సిస్టర్స్ అందరూ కలిసి రాత్రి పార్టీ ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను నిహారిక స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
ఇకపోతే నిహారిక వివాహాన్ని రాజస్థాన్ ఉదయపూర్ కోటలో పెళ్లి జరగనున్న సంగతి తెలిసినదే. అయితే ఇప్పటికే కోటలో పెళ్లి హడావిడి మొదలైనట్లు తెలుస్తోంది. స్వయంగా నిహారిక వెళ్లి పెళ్లి పనులను పర్యవేక్షించారు. అయితే పెళ్లి కోసం కోటను ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిహారిక షేర్ చేసిన ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!