సాధారణంగా కొందరు తమ ఊరికి రైల్వే స్టేషన్ కావాలని గట్టిపట్టుతో సాధిస్తూ ఉంటారు. కానీ అలా అని ఆ రైల్వేస్టేషన్లో ఎవరు టికెట్లు కొనుగోలు చేయకపోతే ఆ రైల్ ని బ్యాన్ చేస్తారు. ఎంతో కష్టపడిన వారి కష్టం మొత్తం అక్కడితో పోతుంది.
అందువల్లే ఒక గ్రామ ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి రోజుకో 60 టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక గ్రామంలో రైల్వే స్టేషన్ ఉంది కానీ అక్కడ ఎవరు పెద్దగా ఎక్కరు. అయినప్పటికీ 60 టికెట్లు దాకా బుక్ అవుతాయి. ఎందుకంటే తమ ఊరికి ఓ రైలు రద్దు కాకూడదనే సంకల్పంతో వ్యాపారులు మరియు దాతలు ముందుకొచ్చి ఇలా 60 టికెట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఈ తంతు వరంగల్ జిల్లా నేలకొండ రైల్వే స్టేషన్ లో జరుగుతుంది. తిరుపతి, ఢిల్లీ మరియు హైదరాబాద్ తదితర ముఖ్య ప్రాంతాలకి వెళ్లే రైలు అక్కడ జనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఆదాయం తగ్గుతుంది అనే క్రమంలో రైల్వే అధికారులు ఈ రైన్ ని రద్దు చేశారు.
అయితే మూడు నెలల పాటు ఆదాయం వస్తే కొనసాగిస్తామని లేకపోతే రద్దు చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక నెక్కొండ పట్టణ రైల్వే స్టేషన్ టికెట్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. వీరంతా ఇప్పటివరకు విరాళాల రూపంలో 25 వేలు చెల్లించారు. దీంతో ఈ రైలు ప్రస్తుతం ఆ గ్రామంలో పర్యటిస్తుంది. స్టేషన్ కి ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.