ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలన్ మస్క్ పలు మార్పులు చేర్పులు జరుపుతున్నారు. తాజాగా ట్విట్టర్ లోగోను కూడా మార్చేశారు. ఇప్పటి వరకూ ట్విట్టర్ లోగో నీలి రంగు పిట్ట (బ్లూ బర్డ్) ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో బ్లాక్ షాడో ఉండగా.. తెలుపు రంగులో ఎక్స్ వచ్చి చేరింది. నూతన లోగోను ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, సీఈఓ లిండా ఆవిష్కరించారు. ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం వద్ద కూడా లోగోను మార్చారు. గత ఏడాది మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి మస్క్ పలు మార్పుల ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
లోగో మార్పు గురించి నిన్నటి నుండే మస్క్ హింట్ ఇస్తూ వచ్చారు. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ఛేంజ్ చేయాలని అనుకుంటున్నా అని పోస్టు చేశారు. ట్విట్టర్ బ్రాండ్ పక్షులకు వీడ్కోలు పలుకుతాం అని ప్రకటించారు. అనుకున్నట్లు లోగో ఛేంజ్ చేశారు. లోగోతో పాటు డొమైన్ పేరు కూడా మారింది. అంతకు ముందు ట్విట్టర్.కామ్ ఉండగా.. అది ఇప్పుడు ఎక్స్.కామ్ గా మారింది. అయితే తాజా మార్పుపై నెటిజన్ ల నుండి మిశ్రమ స్పందన వస్తొంది.
లోగో మార్చారో లేదో గుడ్ బై ట్విట్టర్ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. పాత లోగో స్థానంలో కొత్తది తీసుకురావడాన్ని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మస్క్ బూ పిట్టను సమాధి చేసినట్లుగా ఫోటోతో ఆర్ఐపీ అంటూ షేర్ చేస్తున్నారు. అంతకు ముందు లోగో మార్పునకు సంబంధించి తన ఫాలోవర్లను మస్క్ అడిగారు. సైట్ కలర్ బ్లూ నుండి బ్లాక్ కు మార్చడంతో ఇష్టపడతారో లేదోనని సందేహం వ్యక్తం చేశారు. ఆయన ఊహించినట్లుగానే నెటిజన్ ల నుండి కామెంట్స్ వస్తున్నాయి.
Bye bye blue bird..u will be missed.#TwitterX pic.twitter.com/uH3S8uZL6F
— Don Pappi (@_ngatia_) July 24, 2023