Viral Video : తాజాగా ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ youtuber Mr. Beast చేసిన ఓ స్టంట్ వీడియో వైరల్ అవుతుంది.. బీస్ట్ ఏకంగా 50 గంటలపాటు సజీవ సమాధి అయ్యాడు.. ఓ శవపేటిక లో అతన్ని ఉంచి భూమిలో పాతి పెట్టారు.. జిమ్మి డోనాల్డ్ సన్ అనే యూట్యూబర్ తన 5.75 కోట్ల మంది సబ్స్క్రైబర్ల ను అలరించడానికి ఇలా వింత వింత వీడియోలను చేస్తూ ఉంటాడు..
తాజాగా పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా రెండు రోజుల పాటు సజీవంగా తనను భూమిలో పాతి పెట్టడం విశేషం. దీనికి సంబంధించిన 12 నిమిషాల వీడియోను తన చానల్లో మిస్టర్ బీస్ట్ పోస్ట్ చేశారు.. ఈ వీడియోను కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా చూడడం విశేషం. రెండు రోజులపాటు అతడు ఆ శవపేటిక లోనే పడుకొని ఉన్నాడు. తినడానికి కొంత ఆహారంతో పాటు అతని కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేశారు. బయటి నుంచి ఆక్సిజన్ను పంపడంతో పాటు.. అత్యవసరం అయితే చికిత్స పొందడానికి డాక్టర్ ను కూడా సిద్ధంగా ఉంచారు. 2017 లో నేను లక్షా లెక్క పెట్టాను.. అని అతడు చేసిన వీడియో వైరల్ గా మారింది.. అంతే అప్పటి నుంచి అతను చేసిన ప్రతి వీడియోను రెండు కోట్ల కు మందికి పైగా చూస్తారు. యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డు ఉంది.. ఆ రికార్డు ఇదే..