కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజూ వేల కొద్దీ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ అరకు లోయపై పడింది. ఈ పర్యాటక ప్రాంతం సంపూర్ణ లాక్ డౌన్ లోకి వెళ్లనుంది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అరకు లోయలో పెరుగుతుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు అధికారులు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ గిరిజన, వ్యాపార, జేఏసీ, ఇతర సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసారు. లాక్ డౌన్ విధించడం పట్ల వారి అభిప్రాయాలను సేకరించారు. చర్చల అనంతరం 14 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం సరైన మార్గమని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.