30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్ అయిన ప్రముఖ నటుడు పృథ్వీ తీవ్ర ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసారు. గత అర్ధరాత్రి తాను ఆసుపత్రిలో చేరినట్లు వీడియోలో తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ గత పది రోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నానని, కరోనా టెస్టులు చేయించగా నెగటివ్ అని వచ్చిందని, ఎందుకైనా మంచిదని సిటీ స్కాన్ కూడా చేయించానని, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని పృథ్వీ వీడియోలో వివరించారు. మనందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తనపై ఉండాలని పృథ్వీ కోరుకున్నారు. గతేడాది వైసీపీ తరుఫున ప్రచారం చేసి అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవిని అలంకరించిన పృథ్వీ అంతే అనూహ్యంగా ఆడియో టేప్ లీకేజ్ వ్యవహారంతో పదవికి దూరమయ్యారు.
Comedian #Prudhviraj undergoing treatment for sickness and wishing all your prayers for his sppedy recovery. pic.twitter.com/9RwCLmFH2z
— Vamsi Shekar (@UrsVamsiShekar) August 4, 2020
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!