ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ఆమె పదవీకాలం ముగుస్తుందనగా మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. మొదట జూన్ తో ఆమె పదవీ కాలం ముగియాల్సి ఉంది.
అప్పుడు మూడు నెలలు పొడిగించడం వల్ల సెప్టెంబర్ 30న ఆమె పదవీ విరమణ పొందనున్నారు. నిజానికి ముందు ఆరు నెలలు ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వం కోరింది. అప్పుడు మూడు నెలలు పొడిగించారు. ఇప్పుడు మరోసారి ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించారు. తాజా ఉత్తర్వులతో ఆమె డిసెంబర్ 31న పదవీ విరమణ పొందనున్నారు. అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా ఆమె కొనసాగనున్నారు.