తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసిఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలిలో పరిపాలన చేస్తూ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ జనాదరణ పొందుతున్న కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో బలమైన నేతగా ఎదగాలని అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. రాష్ట్రంలో బాధ్యతలను పూర్తిగా తనయుడు కేటీఆర్ చేతిలో పెట్టి కేసిఆర్ కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెక్ పెట్టే రీతిలో వివిధ పార్టీల రాజకీయ నేతలతో మంతనాలు జరపడానికి రెడీ అయినట్లు టాక్ వస్తోంది.
2019 ఎన్నికల సమయంలోనే దేశం బాగుపడాలంటే కచ్చితంగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెక్ పెట్టాలని కేసిఆర్ పిలుపునివ్వటం అందరికీ తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ అంటూ నానా హడావిడి చేశారు. కానీ ఎందుకో చివరి నిమిషంలో సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్యమం మాదిరి తరహాలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకం చేయడానికి మోడీ సర్కార్ పై నీళ్లు, నిధులు, విద్యుత్ అంటూ పోరాడటానికి కేసిఆర్ సరైన స్కెచ్ వేసినట్లు టాక్ వస్తోంది.
ఈ స్కెచ్ లో భాగంగా దక్షిణాదిలో ఉండే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని కెసిఆర్ భావిస్తున్నారట. ఇదిలా ఉండగా వైయస్ జగన్ హెల్ప్ తీసుకోకుండానే కేసిఆర్ జాతీయస్థాయిలో రాణించాలని అనుకుంటున్నట్లు తెలుగు రాజకీయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో జగన్ సహాయం లేకుండానే ప్రధాని అయిపోదామనే కేసిఆర్ అన్నట్టు సెటైర్లు నెటిజన్ల నుండి వస్తున్నాయట.
కారణం చూస్తే దేశంలోనే ఎక్కువ ఎంపీలు కలిగిన నాలుగో అతిపెద్ద పార్టీగా వైసిపి ఉన్న నేపథ్యంలో పైగా పక్క రాష్ట్రం పైగా తెలుగు రాష్ట్రం కావడంతో జగన్ ని కూడా కలుపుకుని పోవాలని, అప్పుడు బెనిఫిట్ ఉంటుందని కేసిఆర్ కి సూచిస్తున్నారట. మరోపక్క ఇటీవల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ మొండిగా వ్యవహరించడంతో కేసిఆర్ జాతీయ స్థాయిలో జగన్ ని లైట్ తీసుకున్నట్లు టాక్ వస్తోంది. పైగా బిజెపి తో బాగా క్లోజ్ గా ఉన్న తరుణంలో జగన్ ని దూరం పెట్టడమే బెటర్ అని ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు టాక్. ఏదిఏమైనా త్వరలోనే నేషనల్ పాలిటిక్స్ కి కేసిఆర్ సన్నద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది.