NewsOrbit
న్యూస్

ఓట్ల తొలగింపు అవాస్తవం : సిఇఒ ద్వివేది

అమరావతి, ఫిబ్రవరి 21: ఓటర్ల జాబితాపై నిరాధార వార్తలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అమరావతిలో గురువారం ఆయన మిడియాతో మాట్లాడారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలను ద్వివేది ఖండించారు. ఎన్నికల నాటికి తప్పులన్నీ సరి చేస్తామని ద్వివేది చెప్పారు. ఓట్ల తొలగింపు అవాస్తవమని, అలాంటి వార్తలు నమ్మవద్దని ద్వివేది అన్నారు.

ఈ నెల 23,24 తేదీల్లో బూత్ స్థాయి అధికారులతో ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫారం 6,7,8తో పాటు ఓటర్ల జాబితాతో బూత్ స్థాయి అధికారులు వస్తున్నారని ద్వివేది తెలిపారు. వీటిపై అనుమానాలు ఉన్నవారు, ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ద్వివేది సూచించారు. అన్ని పార్టీలు కూడా తమ ఏజంట్లను ప్రత్యేక క్యాంపుల వద్ద పెట్టుకోవాలని ద్వివేది కోరారు.

ఇప్పటికే ఈవీఎంలు పరిశీలన జరిపామనీ, ఇంకా కొన్ని ఈవీఎంల పరిశీలన జరుగుతోందని ద్వివేది తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదనీ, పూర్తి పారదర్శకతతో జరుగుతుందని ద్వివేది స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియ అభ్యర్ధి నామినేషన్ వేసే ముందు రోజు వరకూ జరుగుతూనే ఉంటుందని ఆయన వెల్లడించారు. 13 జిల్లాల్లో పారదర్శకంగా ఈవిఎంలను సిద్దం చేస్తున్న ప్రక్రియనీ, వెబ్ కెమెరాల ద్వారా లైవ్ విజువల్స్‌ను సచివాలయం ఐదో బ్లాకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులకు ద్వివేది చూపించారు.

ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కెమెరాల ద్వారా లైవ్ ఇస్తున్నామని ద్వివేది వెల్లడించారు

ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యిందనీ, దీనికి ఎన్నికల కోడ్ వర్తించదని ద్వివేది తెలిపారు.

ఈ నెల 20,21,22వ తేదీల్లో కేంద్ర ఎన్నికల అధికారులు పలు జిల్లాల్లో పర్యటించి ర్యాండమ్ గా పరిశీలన జరుపనున్నారని ద్వివేది చెప్పారు.

ఓట్లు నమోదు చేసుకున్న కొత్త వారికి మార్చి పదవ  తేదీ నాటికి ఓటరు కార్డులు పంపిస్తామని తెలియజేశారు.

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు.. కావాలని తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ద్వివేది హెచ్చరించారు.

రాష్ట్రం మొత్తం మీద జనవరి 11వ తేదీ నాటికి  మూడు కోట్ల 69 లక్షల ఓట్లు ఉన్నాయని, వీటిలో లక్షా 55 వేల ఓట్లు రెండు సార్లు నమోదు అయ్యాయని, మరో 13 వేల ఓట్లలో తప్పులు ఉన్నాయని ద్వివేది తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు ఉన్న వారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుందని, ఈ సమస్య దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉందని ద్వివేది గుర్తు చేశారు.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Leave a Comment