కుండపోత వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో నదులు, చెరువులు, వాగులు తెగిపోయి నీళ్లు ఊరిలోకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే నడుము లోతు భాగం వరకు నీళ్లు రావడం తో చాలామంది ప్రజలు తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సినీ ప్రముఖులు సెలబ్రిటీలు కూడా విరాళాలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బడా వ్యాపారవేత్తలు పై రాజకీయ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీ లో ఉండే సెలబ్రిటీల దగ్గర కంటే వ్యాపారవేత్తల దగ్గర అదే విధంగా రాజకీయ నాయకుల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటాయని వాళ్లంతా కూడా విరాళాలు ప్రకటించాలని కోరారు. అంతేకాకుండా రాజకీయ రంగంతో పోలిస్తే సినిమా రంగం చాలా చిన్నదని పరిశ్రమలో పేరు ఎక్కువ ఉన్నా గానీ సదరు వ్యక్తి దగ్గర ఆదాయం తక్కువ ఉండే అవకాశం ఉందని తెలిపారు. కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు వేల కోట్ల రుణాలు ఎగ్గోడుతున్నారు. వాళ్లంతా ముందుకు వచ్చి ఈ సమయంలో విరాళాలు అందివ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.