బోయపాటి శ్రీను.. డైరెక్టర్గా సక్సెస్ ఉన్నప్పుడు ఆయనతో సినిమా చేయాలని నిర్మాతలందరూ ఎగబడ్డారు. కొందరేమో ముందుగానే అడ్వాన్స్లిచ్చారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈరోజు మనల్ని కావాలనుకున్నోడు.. రేపు సక్సెస్ లేకపోతే మనల్ని అస్సలు పట్టించుకోడు. ఇప్పుడు బోయపాటి పరిస్థితి అలాగే తయారైంది. `వినయవిధేయరామ` బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడంతో పాటు… నిర్మాత దానయ్యతో బోయపాటి పెద్ద గొడవే వేశాడు. సినిమాలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్కు ఇస్తానన్న ఐదు కోట్ల రూపాయలు ఇవ్వనని మొండికేశాడు. ఈ వ్యవహారం అంతా తేడా కొట్టేసింది. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేస్తానన్న నిర్మాతలు తమ అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమంటున్నారు.
బోయపాటిని డబ్బులు వెనక్కి అడుగుతున్న నిర్మాతల ఈ లిస్టులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ సంస్థ ఆరేళ్ల క్రితం ఇచ్చిన అడ్వాన్స్ను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వమని కోరింది. అందుకు కారణం వినయవిధేయ రామ ఫలితంతో పాటు మరో విషయం కూడా ఉంది. అదేంటంటే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో సినిమాను మైత్రీ మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకుంది. అయితే బాలయ్య తనే స్వయంగా నిర్మిస్తున్నాడు. సరే అసోసియేషన్ అవుదాంలే.. వీలు చూడమని బోయపాటిని కోరారు. బోయపాటి మైత్రీ సంస్థను ఈ ప్రాజెక్ట్లోఅసోసియేట్ చేయించాలని బోయపాటి ప్రయత్నించాడు. కానీ బాలయ్య దగ్గర పప్పులేం ఉడకలేదు. సరే! వేరే సినిమా చేద్దామంటే.. ప్రస్తుత పరిస్థితిలో బోయపాటితో స్టార్ హీరోలు సినిమాలు చేసే ఆలోచనలో కూడా లేరు. నిర్మాతలు అడగ్గానే పై విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బోయపాటి డబ్బుని వెనక్కి ఇవ్వకుండా మొరాయించాలని చూశాడు. దీంతో మైత్రీ సంస్థ లీగల్గా చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకుని అసలే పరిస్థితులు బాగా లేవు. అనవసరంగా కోర్టు గొడవలెందుకులే అనుకున్నాడేమో కానీ.. మైత్రీ సంస్థకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేశాడనేది సమాచారం.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!