తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రతి ఎన్నికల విషయంలో తనదైన ప్రణాళికలను అమలు చేసే గులాబీ దళపతి తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలోనూ ఓ వ్యూహం అమలు చేస్తున్నారని అంటున్నారు. దుబ్బాక ఎన్నికల ప్రచారం తరువాత కాస్త రిలాక్స్ అవుతున్న ఇతర పార్టీలకు షాక్ ఇస్తూ.. అప్పుడే ప్రచారం షురూ చేసిందని సమాచారం.
టీఆర్ఎస్ స్కెచ్ ఏంటంటే…
దుబ్బాక వేడి చల్లారకముందే గ్రేటర్ సెగ అంటుకోబోతోంది. మూడు పార్టీలు ఈసారి నువ్వా నేనా అనేంత రేంజ్లో తలపడబోతున్నాయి. మేయర్ పీఠం మాదేనని టీఆర్ఎస్, మా సత్తా చూపిస్తామంటూ ప్రతిపక్ష పార్టీలు సవాల్ విసురుతున్నాయి. దుబ్బాక ఎన్నికల ప్రచారం తరువాత కాస్త రిలాక్స్ అవుతున్న ఇతర పార్టీలకు షాక్ ఇస్తూ టీఆర్ఎస్ అప్పుడే ప్రచారం షురూ చేసింది. టీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ ప్రచారంలోకి దిగకపోయినా.. గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎప్పుడో మొదలైంది. అదిప్పుడు ఇలా గోడలపై కనిపిస్తోంది. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తూ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను హోర్డింగులలోకి టీఆర్ఎస్ ఎక్కించింది. నగర ప్రజలకు అందిస్తున్న పథకాలు, నగర అభివృద్ధి కోసం చేసిన పనులను వివరిస్తూ కటౌట్లు పెట్టింది. మెట్రో పిల్లర్లు, బస్ స్టాపులపై హోర్డింగులు పెట్టించింది.
ప్రచారంతో హోరు …
ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు, ప్రభుత్వ పథకాలను చెప్పే యాడ్స్ దర్శనమిస్తున్నాయని అంటున్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్లు అందిస్తున్నామని చెప్పేలా టీఆర్ఎస్ పార్టీ యాడ్స్ రూపొందించింది. వీటితో పాటు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు, 5 రూపాయల భోజనం, నగరంలో కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, మెట్రో రైల్ సేవలను కూడా టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా మార్చేసుకుంది. మొత్తంగా విపక్షాలకంటే ముందే టీఆర్ఎస్ నేతలు ప్రచారం మొదలు పెట్టినట్లు సమాచారం.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!