ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఏదో రీతిలో బలపడాలని ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా లేకుండా కేంద్రంలో లో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో… బాగానే చక్రం తిప్పుతూ ఉంది. వైసీపీతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో …. టిడిపి స్థానాన్ని భర్తీ చేయడానికి ఏపీ బిజెపి కీలకంగా పలు విషయాలలో ప్రభుత్వంపై పోరాడుతూ ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క టిడిపి పార్టీకి చెందిన కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమం కూడా బిజెపి చేస్తూ ఉంది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ బీజేపీ అడుగులు వేస్తూ కీలక నాయకులను చేర్చుకుంటుంది. ఇదిలా ఉండగా ఒకానొక టైంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండే ఉత్తరాంధ్ర పై తాజాగా బిజెపి కన్ను పడినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో టిడిపి పార్టీ కి చెందిన కీలక నాయకులను బీజేపీలో చేర్చుకున్నే పనిలో ఏపీ బీజేపీ నేతలు పావులు కదుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా నేత గద్దె బాబూరావు అదేవిధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అగ్రనేతలు చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఉన్నట్లు దీంతో వారిని బీజేపీ టార్గెట్ చేసినట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. మరి జరుగుతున్న చర్చలు బట్టి ఎంతమంది కాషాయ కండువ కప్పుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదు.