దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రాజకీయ పార్టీలను, ప్రజలను తీవ్ర ఉత్కంఠతను కల్గిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థి మద్య నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. ఇప్పటి వరకూ 19 రౌండ్లు పూర్తి అయ్యాయి. 19వ రౌండ్ పూర్తి అయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థిని సుజాత స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి 126 ఓట్ల లీడ్లోకి వచ్చారు. తొలి 11 రౌండ్లలో రెండు రౌండ్ లు మినహా 9 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత కొనసాగారు. 12వ రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. 13వ రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత లీడ్ కొనసాగింది. 19వ రౌండ్ వరకూ టీఆర్ఎస్ కొనసాగుతూ వచ్చింది. దీంతో మిగిలిన నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు కీలకంగా మారింది.
లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 3వ తేదీన జరిగిన పోలింగ్లో మొత్తం 1,64,192 ఓట్లు పోల్ అయ్యాయి.