సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించబోతున్న లేటెస్ట్ మూవీ “సర్కారు వారి పాట”. సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న ఈ సినిమా మీద అటు మహేష్ అభిమానుల్లో ఇటు కామన్ ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేటయింది. ఇక ఈ సినిమా ని పరశురాం తెరకెక్కించబోతున్నాడు.
ఇక ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమా అక్టోబర్ నుంచే మొదలు పెట్టాలని మేకర్స్ భావించినప్పటికి కరోనా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ కంటే విదేశాలలో షూటింగ్ జరపడం ఉత్తమం అని భావించిన మేకర్స్ ఈ సినిమా కోసం అమెరికాలో 45 రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.
కాని ప్రస్తుతం అక్కడ కరోనా సెకండ్ వేవ్ విస్తృతమవుతున్న కారణంగా డిసెంబర్ నుంచి లేదా జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ డిసైడయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తూ అమెరికా లో చేయాల్సిన సీన్స్ మార్చి ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే ఉండేలా మార్పులు చేస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి. ఇక ఇన్ని పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న సర్కారు వారి పాట మొదలయ్యే వరకు పక్కాగా నమ్మలేమన్న మాట కూడా వినిపించింది.
అయితే సర్కారు వారి పాట టీమ్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ తో అలాంటి వాళ్ళందరికి మబ్బులు విడిపోయినట్టే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. కాగా ఈ సినిమాకి ఈ రోజు ఘనంగా పూజా కార్యక్రమాలని నిర్వహించి సర్ప్రైజ్ ఇచ్చారు. మహేశ్ బాబు గారాల పట్టి సితార క్లాప్ కొట్టగా, మహేష్ సతీమణి నమ్రతా కెమెరా స్విచాన్ చేశారు. అంతేకాదు 2021 జనవరి నుంచి సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చి ప్రస్తుతం వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు.