సరికొత్త ఆలోచనలు ఉన్నాయా..? అవి దేశ భవితను మెరుగ్గా మార్చగలవా..? స్టార్టప్ ప్రారంభించడానికి ఆర్థికసాయం, మార్గదర్శకాలు, మౌలిక సదుపాయాలు కావాలా..? అయితే యువతకు ఆహ్వానం పలుకుతోంది నైస్ ప్రోగ్రాం..! మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఆలోచనను స్టార్టప్ గా ఎలా మార్చుకోవాలో.. తెలుసుకోండిలా..!
ప్రపంచ భవితను మెరుగ్గా మార్చగల ఆలోచనలు యువత మేధస్సుకు తడుతూ ఉంటాయి. అయితే వాటిని సహకారం చేయగలిగే వనరుల లభ్యత లేక చాలా మంది నిరుత్సాహ పడుతుంటారు. అలాంటి వారందరినీ ప్రోత్సహించడానికి నైస్ ఒక వేదికగా ఏర్పాటయింది. తరగని ఉత్సాహం, సాంకేతికతపై ఉత్సుకత, ప్రపంచం భవితను మెరుగ్గా మార్చగల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఇది ఆహ్వానం పలుకుతోంది. నైస్ (ఎన్ఎండిసి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్) ప్రోగ్రాం. ఎన్ఎండిసి లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్లో ని స్టార్ట్ప్ సపోర్ట్ సిస్టం, ఐ-టిఐసి ఫౌండేషన్ లకు చెందిన ఈ ఇంక్యుబేషన్- ఫెలోషిప్ కార్యక్రమం ఐదేళ్లపాటు కొనసాగుతుంది. దీనిద్వారా 15 అంకుర సంస్థలకు, 15 ఫెలోషిప్ లకు ఆర్థిక పరంగానే కాకుండా, మౌలిక సదుపాయాలు, మార్గదర్శనం వంటి ప్రయోజనాలను అందజేస్తారు. దేశంలో వ్యవస్థాపకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వటమే దీని లక్ష్యం.
అర్హులు ఎవరు :
డీప్ టెక్నాలజీ పై సరికొత్త మౌలిక ఆలోచనలు ఉండాలి.భారత దేశ పౌరులై, వయసు 18-35 మధ్య ఉండాలి. కనీసం డిగ్రీ ఉండాలి.స్టార్టప్ ఆలోచన టెక్నాలజీపై తప్పనిసరిగా ఉండాలి. డెఫినెట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) తప్పనిసరి. సొంత ఐపి ఉన్న స్టార్టప్స్ కు ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తుదారుల నుంచి ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా డిసెంబర్ 20 కి సమాచారం అందిస్తారు తరువాత దశ ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది.
స్టార్టప్స్ కు ప్రోత్సాహం :
నైస్ ప్రోగ్రాం ద్వారా అంకుర సంస్థలు విజయవంతమైన బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా అభివృద్ధి చెందేలా సహాయ, సహకారాలు అందిస్తారు. ఎంపికైన సంస్థకు రూ.25 లక్షలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: 6/12/2020.