బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదట్లో హోస్ట్ నాగార్జున షో సూపర్ హిట్ అయ్యింది మంచి టిఆర్పి రేటింగ్ లు వస్తున్నాయి అని చెప్పేవాడు. ఇన్ని కోట్ల ప్రేక్షకులు మీ పర్ఫార్మెన్స్ ను చూస్తున్నారు అని హైప్ తీసుకొచ్చేందుకు ఎన్నో మాటలు మాట్లాడిన నాగార్జున ఇప్పుడు ఒక్కసారిగా వాటి ఊసు ఎత్తట్లేదు. మొదట్లో ఆయన టిఆర్పి రేటింగ్ గురించి చెబితే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు కంటెస్టెంట్లు ఆ మాటే మరిచిపోయారు. ఎందుకంటే టి ఆర్ పీ లేక మొత్తం పూర్తిగా పడిపోయింది.
ఇక స్టార్ మా ఛానల్ లో వచ్చే చిన్నా చితకా సీరియల్స్ కి కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. దీంతో నాగార్జున హైప్ పెంచేందుకు రెండు కథలు చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే ఓట్ల విషయాన్ని ముందు నాగార్జున ప్రస్తావించాడు. ఈ వారంలో భారీగానే ఓట్లు పడ్డాయి…. 9.5 కోట్ల ఓట్లు వచ్చాయని నాగార్జున చెప్పడం గమనార్హం. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్నది అఖిల్, అవినాష్, మోనాల్, అరియానా. ఇక వీరికి అన్ని ఓట్లు పడే సీన్ అయితే లేదని అందరూ అంటున్నారు.
గతవారంలో ఇదే నెంబర్ చెప్పిన నాగార్జున ఈ వారం కూడా అదే సంఖ్య చెప్పడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ వారం అందరికంటే ఎక్కువగా ఓట్లు అఖిల్ కు పడ్డాయని బయట వినిపిస్తోంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. షో టిఆర్పి లేక బాగా ఇబ్బంది పడుతుంది. నిర్వాహకులు ఆసక్తికరమైన టాస్క్ పెట్టడంలో విఫలమవుతున్నారు. ప్రేక్షకులకు ఏంకావాలో నిర్వాహకులు కోరుకుంటున్నారో తెలుసుకోలేక హౌస్మేట్స్ చాలా సేఫ్ గా గేమ్ ఆడుతున్నారు. ఇవేవి టి ఆర్ పి కి హెల్ప్ చేయడం లేదు.
దాంతో నాగార్జున చేతులు జోడించి మరి అందరిని గేమ్ సరిగ్గా ఆడమని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నాగార్జున అదేదో నేరుగా కంటెస్టెంట్ లకే చెబితే అయిపోలేదా అని నెటిజన్లు చురుక్కలు వేస్తున్నారు.