కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా రాణించిన వంగవీటి రాధా సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మారడం జరిగింది. అంతకు ముందు జగన్ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా 2019 ఎన్నికల టికెట్ విషయంలో వైసిపి హైకమాండ్ తో విభేదాలు రావటంతో.. వెంటనే టీడీపీలో చేరడం జరిగింది.
వంగవీటి ఫ్యామిలీ కి బద్ద శత్రువు గా ఉండే టిడిపిలో వంగవీటి రాధ జాయిన్ అవ్వడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే జరిగిన ఎన్నికలలో టీడీపీ భారీ స్థాయిలో ఓటమి చెందడంతో వంగవీటి రాధా చాలావరకు సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో మళ్లీ రాధా వైసీపీలోకి వస్తున్నారు అనే వార్తలు కూడా రావడం జరిగాయి.
అదే క్రమంలో జనసేన లో కూడా జాయిన్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అప్పట్లో వంగవీటి రాధా టిడిపిని విడిపోతున్నట్లు అందరూ భావించారు. కానీ వంగవీటి రాధా నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇటువంటి తరుణంలో కాపు సామాజిక వర్గం లో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధా ఇటీవల అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది అయిన క్రమంలో జన భేరీ సభలో చంద్రబాబు పక్కనే కూర్చోవటంతో ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లే అన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో వంగవీటి రాధా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉద్దేశించి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఒక కులానికి ఆపాదించి ప్రచారం చేయటం దారుణం అని వైసీపీ పై మండిపడ్డారు. అంతమాత్రమే కాకుండా కావాలంటే తన కులం ఏమిటో చెక్ చేసుకోవాలని వంగవీటి తెలిపారు. తాను దివంగత రంగా గారి అబ్బాయిని అని.. రాష్ట్రం కోసం పోరాడుతానని వంగవీటి అన్నారు. మొత్తంమీద చాలా రోజుల తర్వాత చంద్రబాబు తో వంగవీటి రాధా వేదిక పంచుకోవడం తాజాగా సరికొత్త రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.