రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ శివార్లలో నిర్మితమైన మహాద్భుతం ‘రామోజీ ఫిలిం సిటీ’. స్క్రిప్టుతో ఫిలిం సిటీలోకి వెళ్తే బాక్సులతో బయటకు రావొచ్చు.. అని ఫిలిం సిటీకి పేరు. అన్ని సదుపాయాలు ఉన్నాయి. బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించింది ఇక్కడే. అలాంటి రామోజీ ఫిలిం సిటీ ప్రస్తుత కరోనా సమయంలోనూ భారతదేశ సినీ పరిశ్రమ వర్గాలకు స్వర్గధామంలా నిలుస్తోంది. కారణం.. లాక్ డౌన్ తర్వాత పరిస్థితుల్లో షూటింగ్ ప్రారంభించిన అనేక భాషా సినిమాలు ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలోనే తెరకెక్కుతున్నాయి. ఇందుకు ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం కంటే తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో తక్కువగా ఉండటమే కారణం అంటున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ.. భాషా సినిమాలు తెరకెక్కతూండడమే ఇందుకు నిదర్శనం. ఇటివలే రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాతే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్ సీలోనే షూటింగ్ జరుగుతోంది. ఈనెలాఖరు వరకూ ఇక్కడే షూటింగ్. యాశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్2’ షూటింగ్ కూడా ప్రస్తుతం ఇక్కడే జరుగుతోంది. అజయ్ దేవ్ గన్ ‘మే డే’ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే షూటింగ జరుగుతోంది. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తెలుగు సినిమాల సంగతి సరేసరి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎఫ్ సీ లో షూటింగ్స్ తో హైదరాబాద్ ఖ్యాతి, ఆర్ఎఫ్ సీ పేరు మోగిపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఇది గర్వించే విషయమే.
ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతోంది. ఈ సమయంలో సినిమా షూటింగ్స్, సినిమా ధియేటర్లు అన్నీ ఆగిపోయాయి. ఇటివలే మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డ పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు, టెక్నీషియన్లకు ఇప్పుడు చేతినిండా పని దొరికింది. రామోజీ ఫిలిం సిటీ ప్రస్తుతం సినిమాలతో కళకళలాడుతోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం ఓ కారణమైతే.. సినిమా షూటింగ్స్ అనువైన ప్రదేశం.. అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులో ఉన్న స్టూడియో కావడంతో ఆర్ఎఫ్ సీకి ప్రాధాన్యం పెరిగింది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!