2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ కావడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు విషయం లో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. వాటన్నిటినీ పక్కనబెట్టి ఈ విధంగా జగన్ తో భేటీ అవ్వటం వెనకాల పెద్ద కీలకమైన విషయమే ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో ప్రజలలో కొద్దిగా భావోద్వేగం రేగి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లు కింద నుండి గ్రౌండ్ రిపోర్ట్ అందినట్లు ఈ విషయాన్ని జగన్ కి చెప్పడానికి పీకే వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రామతీర్థం ఘటనలో విగ్రహం ధ్వంసం అయిన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవటం అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రులు కూడా పెద్దగ రియాక్ట్ కాకపోవడంతో ప్రజలలో ప్రభుత్వంపై కొద్దిగా ఆగ్రహం ఉన్నట్లు ఈ విషయాన్ని చెప్పి జగన్ ని అలెర్ట్ చేయడానికి పీకే వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
అంతేకాకుండా తన శిష్యుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో టీడీపీ కి వ్యూహకర్తగా ఉన్న తరుణంలో ఆ ఎన్నికలలో ఏ విధంగా వైసీపీ ముందుకు వెళ్లాలో అన్నదానిపై కూడా జగన్ తో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బెంగాల్ ఎన్నికలలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా ఏపీలో జగన్ తో భేటీ కావడం రాజకీయవర్గాలలో ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ అయింది.