ఏపీ సీఎం వైఎస్ జగన్ క్రేజ్ ఉన్న కొద్ది పెరుగుతోంది. పాలనా పరంగా ఏమాత్రం అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని రెండు సంవత్సరాలు గడవక పోయినా గానీ దేశంలో తలపండి పోయిన రాజకీయ నేతలకు దీటుగా అనేక సర్వేలలో ర్యాంకులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవల ఏబీపీ సీ ఓటర్ సర్వేలో దేశవ్యాప్తంగా టాప్ సీఎం లో మూడో స్థానం జగన్ దక్కించుకోవటం అందరికీ తెలిసిందే.
ఇటువంటి తరుణంలో తాజాగా జమ్మూకాశ్మీర్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నజీర్ అహ్మద్ సీఎం జగన్ పరిపాలన పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని అభివర్ణించారు. అంతేకాకుండా జగన్ లాంటి ముఖ్యమంత్రి దొరకడం ఏపి ప్రజల అదృష్టం అంటూ భారీ డైలాగులు వేశారు.
ఇటీవల ఈయన చిత్తూరు జిల్లాలో పర్యటించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్ ఎంపీ నజీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అదేవిధంగా తెలుగు మీడియా సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. జగన్ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు కాకముందే ఈ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఆదరణ దక్కించుకోవడంతో.. కేంద్రంలో ఉన్న కీలక పెద్దలు కూడా ఏపీలో పాలన పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.