దేశంలో చాలా మంది హీరోలు ఉన్నా గాని కీలక సమయంలో పేదలను ఆదుకుని తనలో మానవత్వాన్ని బయటపెట్టి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలను స్పెషల్ బస్సులతో మరియు ట్రైన్ లతో గమ్యస్థానాలకు చేర్చి ప్రభుత్వాలకు కూడా మతిపోయేలా చేశాడు.
లాక్ డౌన్ ఎత్తివేసిన గాని ప్రస్తుతం సోనూసూద్ ఇంకా తన సేవలు పేద వాళ్లకు అందేలా ప్రత్యేకమైన టీం తో పాటు స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో చాలామంది సోనూసూద్ కి అభిమానుల అవ్వటమే కాక ఆదర్శంగా తీసుకుంటూ .. ఆయనకి గుళ్ళు కట్టేస్తున్నారు.
ఎవరూ చేయని రీతిలో సోనుసూద్ భారీగా సహాయం చేస్తూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో తాజాగా నడిరోడ్డుపై అభిమానం ఏంటో చూపించారు ఆయన అభిమానులు. మేటర్ లోకి వెళ్తే ఆయన డ్యూటీ కి వెళ్తున్న సమయంలో కారు ఆపేసి రోడ్డు పక్కనే ప్రజలంతా సన్మానం చేయడం జరిగింది. దీంతో సోనూసూద్ ఎంతగానో ఆనందించారు. ఈ అరుదైన దృశ్యాన్ని.. అక్కడ ఉన్న వాళ్లంతా కెమెరాలతో చిత్రీకరించడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.