Devineni Uma :అప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక అసెంబ్లీని రద్దు చేయడం కోసం గవర్నర్ ని కలుస్తానని అసెంబ్లీని రద్దు చేస్తానంటూ జగన్ ప్రగల్భాలు పలికారని దేవినేని ఉమా తాజాగా పేర్కొన్నారు.
తాను రాజీనామా చేస్తానని ఎన్నికలకు వెళ్తానని తాడేపల్లి రాజప్రసాదంలో జగన్ భారీ డైలాగులు వేశారని మరి ఎందుకు వెనక్కి తగ్గారని తాజాగా దేవినేని ఉమ ప్రశ్నించారు. అదే టైంలో వైసిపి పార్టీకి చెందిన నేతలు కూడా భారీ డైలాగులు వేశారు ఇప్పుడు వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయారు అంటూ దేవినేని ఉమా సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఆ సమయంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలని చూసిన జగన్ సర్కార్ కి.. ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ అదేవిధంగా ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చూసి షాక్ అయ్యారని, భయపడ్డారు అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం నిన్న జరిగిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా భారీ డైలాగులు వేశారు. పరిస్థితి ఇలా ఉండగా ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది అంటూ మరోసారి రెచ్చిపోయారు. ప్రజలను భయపెట్టి ఏకగ్రీవాలు కోసం వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఎవరైతే పోటీకి దిగుతున్నారో వాళ్ళు ఎవరూ బెదిరింపులకు లొంగి పోకూడదని ధైర్యంగా నిలబడాలని దేవినేని ఉమ సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరగలేదని కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీఆర్వోలు కూడా రాష్ట్రంలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అంటూ ఇదంతా అధికార పార్టీ కుట్ర అంటూ దేవినేని ఉమా వైసీపీ పై ఫైర్ అయ్యారు.