NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Budget 2021 : కోడలు..కోడలే..! కోడలు కూతురు కాలేదుగా..?

Budget 2021 : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మరో అయిదు ప్రాధామ్యాలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన తొలుత జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2021-22 బడ్జెట్‌ను ఆమోదించారు. అనంతరం పార్లమెంట్ ‌లో విపక్షాల నిరసన మధ్య మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను చదివి వినిపించారు.

Budget 2021 : AP leaders dissatisfied with central budget
Budget 2021 : AP leaders dissatisfied with central budget

అయితే బడ్జెట్‌ కేటాయింపులపై ఏపిలోని అధికార ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజకంగా ఉందని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఏపిపై సవతితల్లి ప్రేమ చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన బడ్జెట్ ల కంటే చాలా చెత్తగా ఉందని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్ఛేరి, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని అందరూ ఊహించారు. అందరి ఊహలకు అనుగుణంగానే మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఈ రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులు జరిగాయి.

తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3500 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. మధురై – కొల్లమ్ కారిడార్, చిత్తూరు – తుత్పురు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారుల నిర్మాణం జరగనున్నది. కేరళకు భారీగానే కేటాయింపులు జరిగాయి. దాదాపు 1100 కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6700 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి 25వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అసోం రాష్ట్రంలో రహదారుల నిర్మాణంకు రూ.19వేల కోట్లు కేటాయించింది కేంద్రం. వీటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇది ఎన్నికలు ఉన్న రాష్ట్రాల బడ్జెట్ లా ఉందని అన్నారు.

కేంద్రం తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించిందని విమర్శించారు ఏపిసిసి అధ్యక్షుడు శైలజానాధ్. కేంద్ర బడ్జెట్ పేదలకు షాక్ ఇచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్ దరలు పెంచడం వల్ల రవాణాస, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని ఆయన అన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఏపిని విస్మరించడం బాధాకరమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన కేంద్రం..తెలుగు రాష్ట్రాలను విస్మరించిందన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళుల ఆడపడుచు. తెలుగింటి కోడలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని కోడలు కోడలే..కోడలు కూతురు కాలేదుగా అని అంటున్నారు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?